బ్రేకింగ్: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

-

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సర్వదర్శనం టోకెన్లు జారీని ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శనం టోకెన్ జారీ కేంద్రాలను పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టోకెన్లను జారీ చేస్తున్న భూదేవి కాంప్లెక్స్ తో పాటు విష్ణు నివాసం, మహతి ఆడిటోరియం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద సర్వ దర్శనం టికెట్ల జారీ కేంద్రాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

ట్రయల్ రన్ క్రింద 10 వ తేదీ వరకు పరిశీలించి ఆ తరువాత టోకెన్ల జారీని కొనసాగించాలా… లేక రద్దు చెయ్యాలో టీటీడీ అధికారులు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం, ఉంది అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news