తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..ఇవాళ ,రేపు వసతి గదుల కోటా విడుదల

-

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలకమండలి. ఇవాళ, రేపు వసతి గదుల కోటా విడుదల చేయనుంది. ఇవాళ ,రేపు వసతి గదులు కోటాను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టీటీడీ పాలకమండలి. ఇవాళ తిరుపతిలోని వసతి గదులు కోటాను, రేపు తిరుమలలోని వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలకమండలి.

కాగా, ప్రస్తుత తిరుమలలో ఒక కంపార్టుమెంట్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,971 మంది భక్తులు కాగా…తలనీలాలు సమర్పించిన 25,574 మంది భక్తులుగా నమోదు అయింది. ఇక నిన్న ఒక్క రోజే ఏకంగా తిరుమల శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news