శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీ వరద.. నీటి మట్టం ఎంతంటే..?

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు అన్ని నిండు కుండలా మారిపోతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం ఇన్ ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810. 90లకు వరద నీరు చేరింది.

దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యామ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు మరింత వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువ వదిలేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు గోదావరి నది కూడా పరుగెడుతోంది. భద్రాద్రి జిల్లాలో భారీ వరద పారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news