బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు.. రాగల 5 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

-

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో ముసురు పట్టింది. ఈ నెల 19న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు  సోమవారం కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news