శ్రీలంక టూర్ లో టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ?

-

టీ20 ప్రపంచకప్,  జింబాబ్వే సిరీస్​లో విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది.  రానున్న టోర్నీల్లోనూ మరింత మెరుగ్గా పర్ఫామ్ చేయాలని ప్లేయర్లు ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న శ్రీలంక టూర్​ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ టీమ్ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుండగా.. జులై 26 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్‌ మొదలవ్వనుంది.

అయితే ఈ సిరీస్ కు టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎవరు రానున్నారన్న విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలోనూ టీమ్ఇండియాకు సారధిగా ఉన్న అనుభవం ఉండటంతో కెప్టెన్సీ లిస్ట్​లో హార్దిక్​ పేరు ముందున్నట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ  ఫార్మాట్​కు కేఎల్ రాహుల్​ లేదా..  శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్​లో కమ్​ బ్యాక్ ఇచ్చే ప్లాన్స్​లో ఉన్నందున అతడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక భారత కోచ్‌గా గౌతమ్‌ గంభీర్ ప్రయాణం కూడా ఈ సిరీస్‌తోనే మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news