చంద్రబాబు అరెస్ట్..తెలంగాణ,ఏపీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ !

-

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ప్రొఫెషనల్స్… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తోన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. అయితే.. ఐటి ఉద్యోగుల ఛలో రాజమండ్రి సెంట్రల్ జైలు నేపధ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఏపీ పోలీసులు.

High tension on the borders of Telangana and AP
High tension on the borders of Telangana and AP

సెంట్రల్ జైలుతో పాటు, రాజమండ్రి ఆర్.వి.నగర్ లో ఉన్న టిడిపి క్యాంప్ శిబిరం వద్ద భారీగా మెహరించింది పోలీసు బందోబస్తు. రాజమండ్రిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్, 144 సెక్షన్ లు అమలు చేస్తున్నా రుపోలీసులు. అటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని రాజుపేట వద్ద ఆంధ్ర – తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. తిరువూరు సీఐ ఆర్ భీమరాజు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు..జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news