చదువురాని వెదవలకు సమాధానం ఇవ్వను – మంత్రి రోజా

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న మంత్రి రోజా పదవి చేపట్టిన నాటి నుండే తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. మంత్రి రోజా ఏం చేసినా అందులో తప్పులు వెతకడంలో తెలుగుదేశం పార్టీ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇటీవల రోజా ఖరీదైన మెర్సిడిస్ బెంజ్ కారు కొన్నారని కొద్ది వారాలుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటిన్నర విలువైన ఆ కారును మంత్రి రోజా లంచాలు తీసుకొని తన కుమారునికి గిఫ్ట్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు, సోషల్ మీడియాలలో ప్రచారం చేశారు.

అయితే ఈ విమర్శలపై మంత్రి రోజా స్పందించారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారని ఆమె అన్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్లుగా టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే 150 సినిమాలకు పైగా నటించానని, జబర్దస్త్ వంటి షోలలో 2 లక్షల పైగా రిమ్యునరేషన్ తీసుకున్నానని.. ఆ డబ్బుతోనే కొనుక్కున్నానని రోజా స్పష్టం చేశారు. తాను లంచాలు తీసుకొని కారు కొన్నానని జనసేన, టిడిపి నాయకులు ప్రచారం చేస్తుండడం హాస్యాస్పదమని అన్నారు. చదువురాని ఎదవలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news