రాజకీయ కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి.. పిల్లలపై కాదు : జోగి రమేష్

-

రాజకీయ కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి.. పిల్లలపై కాదు అని మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో పోలీసు విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. కక్షnపూరితంగానే నన్ను, నా కుటుంబాన్ని కేసులు పేరుతో వేధిస్తున్నారు. ఈ విషయం పై  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వద్ద చెప్పమన్నా చెబుతాను అన్నారు.

చంద్రబాబు ఇంటి వద్ద ఘటనకు సంబంధించిన వివరాలు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. మళ్లీ ఎప్పుడు రావాలి అనేది మాత్రం ఏమీ చెప్పలేదు. అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మందితో ఫోన్లు సంభాషించే వాడిని. ఆ సమాచారం కూడా ఇచ్చాను. ఇందులో దాపరికాలు, దాచుకోవటాలు,ఏమీ లేవు అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. నిరసన తెలియజేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లాను. చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళింది దాడి చేయడానికి కాదని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news