గౌతమ్ రెడ్డి : చావు ఇంట నవ్వులా? మరో వివాదంలో నాని ?

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్  రెడ్డి నిన్న‌టి వేళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.గుండెపోటుతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు.కుటుంబ‌స‌భ్యులు వెనువెంట‌నే స్పందించి,అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింది.అనంత‌రం  పార్థివ దేహాన్ని జూబ్లిహిల్స్ లోని గౌత‌మ్ రెడ్డి స్వ‌గృహానికి త‌ర‌లించారు.ఇవాళ ఆయ‌న మృత‌దేహాన్ని నెల్లూరుకు తీసుకురాను న్నారు.రేప‌టి వేళ అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు.కుమారుడు విదేశాల్లోఉండ‌డంతో ఆయ‌న వ‌చ్చాకే అంత్య క్రియ‌లు చేప‌ట్ట‌నున్నామ‌ని,అధికార లాంఛ‌నాల‌తో ఇవి జరుగుతాయని ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  తెలిపారు.

Mekapati Goutham Reddy
Mekapati Goutham Reddy

నిన్న‌టి వేళ ఆయ‌న పార్థివ దేహాన్ని సంద‌ర్శించిన వారిలో సీఎం జ‌గ‌న్,  తెలంగాణ మినిస్ట‌ర్స్ కేటీఆర్, శ్రీ‌నివాస్ గౌడ్ ఇంకా ఇంకొంద‌రు,జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని  స్మ‌రించుకున్నారు.టీడీపీ అధినేత చంద్ర‌బాబు,మేకపాటి బంధువు, టీడీపీ నేత  సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఇంకా ఇంకొంద‌రు హైద్రాబాద్ కు చేరుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి,వారిని ఓదార్చారు.

ఇక తాజా వివాదం ఏంటంటే…

మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి చ‌నిపోవ‌డంతో విజ‌య‌వాడ నుంచి హైద్రాబాద్ కు  చేరుకున్న మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ త‌దిత‌రులు అక్క‌డే ఉండి న‌వ్వులు చిందించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. విప‌క్ష పార్టీ నేత అయ్య‌న్న పాత్రుడు ఈ మేరకు సంబంధిత వీడియో ఒక‌టి ట్వీట్ కూడా చేశారు. ఓ వైపు అంతా విషాదంలో ఉంటే మ‌రోవైపు బాధ్య‌త మ‌రిచి మంత్రితో స‌హా ఆయ‌న స్నేహితులు చావు ఇంట న‌వ్వులు పూయిస్తున్నార‌ని ఆవేద‌న చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news