రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ఎల్లుండి కూడా అక్కడే !

-

రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు వెళ్లనున్న ఆయన ఎల్లుండి కూడా అక్కడే ఉండనున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని అంటున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు జగన్. ముందుగ రేపు ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి కడప కు చేరుకోనున్న జగన్, కడప నుంచి ఉదయం 11. 20 గంటలకు పులువెందుల నివాసానికి చేరుకోనునున్నారు.

Jagan
Jagan

తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు కడప నుంచి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల వివాదం పై జరిగే “ అపెక్స్ కౌన్సిల్” సమావేశంలో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. అయితే ఇది జరిగేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అయినా ఆయన ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news