రేపు ఢిల్లీకి జగన్..ప్రధాని మోదీతో భేటీ

-

సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక రోజు విశ్రాంతి తీసుకుని తిరిగి ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ప్రధాని మోడీ తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వీటి పై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జగన్ దావోస్ లో ఉన్నప్పుడే మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికల అంచనాలతో నే వైసిపి రాష్ట్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే విపక్షాలు కూడా జనంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రధానిని ముందస్తు ఎన్నికలపై ఒప్పిస్తే ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news