ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల 

-

ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కానున్నాయి.ఏప్రిల్‌ – జూన్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ నేడు బాపట్లలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

cm jagan
cm jagan

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం సాయం రూ. 11,715 కోట్లు అందించింది.

పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది జగన్‌ ప్రభుత్వం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news