రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఈ పర్యటనలో భేటీ అవుతారు సీఎం జగన్. ముఖ్యంగా అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో కీలక చర్చలు నిర్వహించనున్నారట సీఎం జగన్.

జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ

వాస్తవంగా శనివారమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా… మంత్రులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో పర్యటనను రేపటికి వాయిదా వేశారట సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థీకరణ చట్టం అంశాలు, విభజన హామీలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించనున్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కంటే ముందు ప్రధాని మోడీతో జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. అటు తెలుగుదేశం మరియు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించిన బిజెపి పార్టీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంటోందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news