జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా : సీఎం జగన్

-

తాను దేవుడిని, ప్రజలను తప్ప ఎవ్వరినీ నమ్ముకోలేదని తెలిపారు సీఎం జగన్. ఉరవకొండ సభలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుట్రలు, కుతంత్రాలతో జెండా జత కట్టడమే విపక్షాల అంజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అన్నారు.

చెడు మాత్రమే చేసిన చంద్రబాబు ముఠా కి… ఎప్పుడు మంచి చేసిన చరిత్ర లేదు అన్నారు సీఎం జగన్. రోజూ ఇలాంటి వాళ్ళ కి సమాధానం ఇచ్చుకోవాల్సి రావడం అంటే దీన్నే కలికాలం అంటారు. ఏ మంచి చేయకపోయినా చెడు చేసినా.. ఆయనకు స్టార్ క్యాంపియన్ లు.. భుజాన ఎత్తుకొని మోసెందుకు చాలా మంది స్టార్ క్యాంపెయిన్ లు ఉన్నారు. పక్క రాష్ట్రం లో పర్మినెంట్ రెసిడెంట్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు వదిన చంద్రబాబు కి స్టార్ క్యాంపెయిన్ లు.

రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ లోకి వెళ్ళిన అభిమానుల సంఘం అంతా చంద్రబాబు స్టార్ క్యాంపియన్ లే(షర్మిల ప్తె పరోక్ష వ్యాఖ్యలు). బీజీపీ లో తాత్కాలికంగా తల దాచుకున్న పచ్చ చికాల వాళ్ళు వారు బాబు స్టార్ క్యాంపియన్ లే. అమరావతి పేరు తో ను చంద్రబాబు కి స్టార్ క్యాంపెయిన్ లుగా పని చేస్తారు. వీరంతా దోచుకొని పంచుకోవడం చేస్తారు. ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకి ఎలాంటి స్టార్ క్యాంపైనర్లు లేరు. వీళ్ళకంటే ఎక్కువ గా నాకు ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు తో జెండా లు జతకట్టడం వాళ్ళకి తెలుసు. మంచి చేసి జనం గుండెల్లో గుడి కట్టడమే నాకు తెలుసు. ప్రతి ఇంట్లో మంచి పొందిన అందరూ నాకు స్టార్ క్యాంపియన్ లే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news