BREAKING : ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం !

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ నియామకం కానున్నారు. ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జగన్ ప్రత్యేక సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సిఎస్ కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

గత కొన్ని రోజులుగా ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన పదవీకాలం కూడా ఏపీ కొత్త సిఎస్ నియామకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ గా నియామకం చేసేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జవహర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్న జగన్.. త్వరలోనే నిర్ణయం కూడా తీసుకొని ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news