చంద్రబాబు అరెస్ట్ పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. చంద్రబాబు 100కు 100% అవినీతి చేశాడని అన్నారు. అవినీతి చేసిన చంద్రబాబును మహాత్మా గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టిడిపి కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదని.. ఆయన అరెస్టు పట్ల ప్రజలతోపాటు టీడీపీ కార్యకర్తలలో ఎటువంటి స్పందన లేదన్నారు.

చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసని.. ఎందుకంటే అతడు తన శిష్యుడేనని అన్నారు. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు. చంద్రబాబు, జగన్ కేంద్రానికి తొత్తులని.. పవన్ కళ్యాణ్ డాన్సులు వేస్తున్నాడని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివైన వాడని, ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉన్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news