కోడి కత్తి కేసు విచారణ జూన్ 15 కి వాయిదా

-

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సమయంలో 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నంలోని విమానాశ్రయంలో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ ని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు నిందితుడు జనిపల్లి శ్రీను కి శిక్ష విధించింది.

అయితే ఇటీవల ఈ కేసులో తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని, ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేయాలంటూ రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తదుపరి విచారణ జూన్ 15వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news