క్రైస్తవులతో సీఎం జగన్‌ ను దెబ్బకొడతా? – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

-

క్రైస్తవులతో సీఎం జగన్‌ ను దెబ్బకొడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదని… ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా అడుగు ముందుకు పడ లేదని ఆగ్రహించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని.. అధికార పార్టీ నాయకులు మాత్రం తనకు ఇప్పుడే సమస్యలు గుర్తుకు వచ్చాయా ఆని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

సమస్యలు పరిష్కరిస్తే జిల్లా అధికార పార్టీ నేతలకు నేనే ధన్యవాదాలు చెబుతానని.. ఎమ్మెల్యే అంటే ప్రజల గుండెచప్పుడు అందువల్లే పోరాటాలు చేస్తున్నానన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం ఈనెల 8న ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్ పోస్ట్ కార్డులు టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా సమస్యను తెలియజేస్తాం…8 నుంచి పది రోజులపాటు నెల్లూరు నగర …రూరల్ నియోజకవర్గాలలోని చర్చిలను సందర్శించి క్రిస్టియన్ సోదరుల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రతి చర్చి నుంచి ఒక ఇటుక ను తీసుకుని కమిట్ హాల్ కోసం కేటాయించిన స్థలంలో నిరసన తెలువుతామన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news