కుప్పం బీసీల సీటు.. చంద్రబాబు లాగేసుకున్నాడు – సీఎం జగన్

-

కుప్పంలో బిసిలు పోటీ చేయాల్సిన సీటు అని… బిసిల సీటును లాక్కుని చంద్రబాబు పోటి చేస్తున్నాడని ఆగ్రహించారు సీఎం జగన్‌. ఇవాళ కుప్పం నియోజక వర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. 26,39,703 మందికి వైఎస్సార్‌ చేయూత అందిస్తున్నామని ప్రకటించారు.

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌..కుప్పానికి నాన్‌ లోకల్‌ అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుకు మామ పై ఎలాంటి ప్రేమ ఉందో అందరికీ తెలుసు.. అలాగే కుప్పంపై కూడా చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమే ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు.. తనకు కావలసింది తీసుకున్నాడు, పిండుకున్నాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి బిసిలకు న్యాయం చేస్తామని అంటాడన్నారు.

36 సంవత్సరాలలో కుప్పం సీటును ఒక్కసారి అయినా బిసిలకు ఇచ్చారా…అని నిలదీశారు. కుప్పం మీద చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమా మాత్రమేనని ఎద్దేవా చేశారు. జాబ్ రావాలంటే బాబు రావాలంటాడు…కుప్పం నుండి రోజు ఐదు వేల మంది నిత్యం పక్క రాష్టాలకు వెళుతుంటారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news