లోకేష్ సీఎం అవ్వాలని భువనేశ్వరి క్షుద్ర పూజలు .. లక్ష్మీ పార్వతి సంచలనం !

-

డిక్లరేషన్ విషయంలో వస్తున్న ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్షి పార్వతి మండి పడ్డారు. ప్రతి పక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అంత పని పాట లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిక్లరేషన్ పేరుతో అనవసరంగా ప్రభుత్వంపై సీఎంపై బురద చల్లుతున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె బాబు సతీమణి భువనేశ్వరి మీద సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ ని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసిందని, విజయవాడ అమ్మవారి దేవాలయంలో అర్ధ రాత్రి క్షుద్ర పూజలు చేయించిన దుర్మార్గురాలు చంద్రబాబు భార్య అని అన్నారు.

బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరంలో కూడా జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారని ఆమె ప్రశ్నించారు. భువనేశ్వరి,లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలన్న ఆమె ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయని అన్నారు. బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలన్న ఆమె జగన్ ఎప్పుడో హిందువుగా మారారని అన్నారు. గతంలో స్వరూపానంద జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని గంగా నదిలో పూజలు చేయించారని, గంగా నదిలో మూడు మునకలు మునిగి హిందువుగా మారారని అన్నారు. అలా అని క్రిస్టియానీటిని పక్కన పెట్టినట్లు కాదని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news