ఏపీ విద్యార్థులకు అలర్ఠ్.. ఇంటర్ ప్రవేశాలకు జులై-15 తుది గడువు

-

ఏపీ విద్యార్థులకు అలర్ఠ్.. ఇంటర్మీడియట్ రెండో విడత అడ్మిషన్లను జూలై 15 లోగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు కళాశాలలకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాలకు జూలై 15 తుది గడువని స్పష్టం చేశారు. మరోసారి పొడిగించే అవకాశం లేదని వెల్లడించారు.

ఇక అటు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు నిన్న విడుదల కాగా, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఈనెల 29వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ. 500, ఆన్సర్ షీట్ ఫోటో కాపీ, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున CFMSలో చెల్లించాలని అధికారులు తెలిపారు. దరఖాస్తులను DEO ఆఫీసుల్లో ఇవ్వాలని, పోస్ట్ ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించే వాటిని తీసుకోబోమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news