లోకేష్ కి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం ఏర్పడి ఉండొచ్చు – సజ్జల

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఎంతో చవకబారుగా వ్యవహరించారని మండిపడ్డారు. లోకేష్ ది చిల్లర వ్యవహారం అని విమర్శించారు సజ్జల. లోకేష్ కి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం ఏర్పడి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు బిజెపితో కలిసి వెళ్లేందుకు పాకులాడుతున్నారని, అందుకే ఢిల్లీ వెళుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు మాటలు పగటి కలల ఉంటాయని విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర పై తమకు అభ్యంతరం లేదని.. తాము కూడా పవన్ కళ్యాణ్ ని ప్రజలలో తిరగమనే చెబుతున్నామన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంతవరకు తిరుగుతాడు అన్నది నమ్మకం లేదన్నారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రావాలనుకుంటే ప్రజలు ఆమోదించరని స్పష్టం చేశారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news