ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. వైసీపీ పార్టీలో చేరిన చిరంజీవి..

-

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ ఇలాకా అయిన మంగళ గిరిలో తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మంగళ గిరి నియోజక వర్గంలో కీలకంగా ఉన్నటు వంటి టీడీపీ నేత గంజి చిరంజీవి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో కాసేపటి క్రితమే.. వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి, కుటుంబ సభ్యులు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. వైసీపలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటూ వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్‌ పదవులతో పాటూ రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు చిరంజీవి. జగన్‌ సారంథ్యంలోనే పనిచేసేందుకు ఆసక్తి ఉండే.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news