తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..ఇవాళ మే, జూన్ దర్శన టికెట్లు విడుదల

-

 

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ మే, జూన్ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో మే, జూన్ నెలలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.కాగా, నిన్న తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లో వేచివుండే భక్తులు అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారిని 63,870 మంది భక్తులు దర్శించుకున్నారు.. 27,480 మంది భక్తులు…తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజు హుండీ ఆదాయం రూ.3.88 కోట్లుగా నమోదు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news