వచ్చే ఏడాదికే పోలవరం పూర్తి చేస్తాం : అసెంబ్లీలో మంత్రి ప్రకటన

-

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ అంశంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఐదు రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మూడో రోజు సభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చలో భాగంగా మంత్రి అనిల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ డ్రామాలాడటమే సరిపోయిందని కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు 70 శాతం పోలవరం పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్ధమని మంత్రి అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చంద్రబాబు ఒప్పుకోవడం ప్యాకేజీల కోసమేనని అన్నారు. మారిన అంచనాలను సబ్మిట్ చేయాలనీ కోరినా గత ప్రభుత్వం కాలయాపన చేసిందని మంత్రి అనిల్ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news