బోరున విలపించిన మంత్రి… టెన్షన్ లో మచిలీపట్నం… వాట్ నెక్స్ట్?

-

అధికారపార్టీ నాయకుడి అనుచరుడు.. మంత్రికి ముఖ్య అనుచరుడు.. దారుణ హత్యకు గురయ్యాడు! అవును… మచిలీపట్నం చేపల మార్కెట్‌లో సమీపంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు భాస్కరరావుని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే… తన ముఖ్య అనుచరుడు భాస్కరరావు మృతదేహాన్ని చూసి మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు.. మృతదేహం వద్ద బోరున విలపించారు!

“భాస్కర్ ‌రావు పేదల పక్షపాతి.. పేదల మనిషి.. భాస్కర ‌రావు మృతి మచిలీపట్నానికి తీరనిలోటు.. ఘటన మాయని మచ్చ.. రాజకీయ ప్రత్యర్థులు కుట్రపన్ని కిరాతకంగా హత్య చేశారు.. 3 రోజులుగా రెక్కీ నిర్వహించి భాస్కర రావును హత్య చేశారు.. మత్స్యకారుల సంక్షేమం కోసం భాస్కర‌ రావు కృషిచేశారు” అని పేర్ని నాని బోరున విలపిస్తూ స్పందించారు.

ఈ హత్య అనంతరం మచిలీపట్నం లో రాజకీయ సామాజిక పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. పైగా ఇది రాజకీయ ప్రత్యర్ధులు కుట్రపన్ని చేసిన హత్య అని వార్తలు వస్తుండటంతో… ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. పైగా హత్యకాబడిన వ్యక్తి మంత్రి ముఖ్య అనుచరుడు కావడంతో.. వ్యవహారం మరీ హీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలో “ప్రతిదాడులు చేయం” అని మంత్రి పేర్ని నాని స్పందించారు.

కాగా… మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం చేపల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కరరావును నలుగురు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మార్కెట్ యార్డ్ సమీపంలోనే భాస్కర రావును దుండగులు కత్తితో పొడిచారు. అనంతరం బైక్‌లపై పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కరరావును ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news