ఐరన్ లెగ్ లోకేష్ రాష్ట్రమంతా నడిస్తే పరిస్థితి ఏంటి – మంత్రి రోజా

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర అనే ఉద్దేశ్యంతో మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు శనివారం విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐరన్ లెగ్ లోకేష్ రాష్ట్రమంతా పర్యటిస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారని అన్నారు.

నిన్న పాదయాత్ర చేస్తే తారకరత్నకి గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యానించారు. లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి ఎద్దేవా చేశారు. చంద్రబాబు 11 మందిని చంపేశారని, నిన్న ఒకరికి హార్ట్ ఎటాక్ వస్తే మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news