బద్వేల్ టికెట్ దివంగత ఎమ్మెల్యే భార్యకే ?

-

ఏపీలో ఉప ఎన్నికల రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ఎంపీ మరణంతో తిరుపతిల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ కానున్న ఆ స్థానాన్ని ఆయన సతీమణి తో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. బద్వేలు శాసనసభ స్థానానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు అవకాశం దక్కినట్టు చెబుతున్నారు. ఆమె వద్దంటే తప్ప ఆ స్థానాన్ని ఇతరులకు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.

ఈ విషయం పై వెంకటసుబ్బయ్య  భౌతిక దేహాన్ని సందర్శించడానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్ వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి, హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా, వారి పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వెంకటసుబ్బయ్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం జగన్ వైసీపీ ఎప్పటికీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news