టీడీపీలో మ‌రోసారి మోహ‌న్‌బాబు ర‌చ్చ..‌!

-

సినీ విల‌న్‌.. హీరో.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు స్ట‌యిలే వేరు. ఆయ‌న ఏం మాట్లాడినా.. అంతో ఇంతో మీడియాకు రేంటింగ్ వ‌స్తూనే ఉంది. దీంతో ఆయ‌న ఇంట‌ర్వ్యూల‌కు, ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌ల్లో పాపులారిటీ కూడా ఉంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇదే రేంజ్‌లో మంటరేపాయి. ఇటీవ‌ల వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా త‌న ప్ర‌త్యేక గ‌ళంతో మోహ‌న్‌బాబు చ‌వితి పండ‌గ‌ను ఎలా నిర్వ‌హించుకోవాలో వివ‌రిస్తూ.. ఓ రికార్డ్ చేశారు. దీనిని యూట్యూబ్‌లో నేరుగా విడుద‌ల చేశారు. అయితే, దీనిపై ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ మోహ‌న్‌బాబుతో ముచ్చ‌టించింది.

ఈ స‌మ‌యంలో మోహ‌న్ బాబు ఆ మాటా ఈమాటా మాట్లాడుతూ.. ఏపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో జ‌గ‌న్ పాల‌న బాగానే ఉంద‌న్న ఆయ‌న‌.. చంద్ర‌బాబుపై మాత్రం నిప్పులు చెరిగారు. వాస్త‌వానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా చంద్ర‌బాబు ఓట‌మి కోసం చేయాల్సినంత చేశారు మోహ‌న్‌బాబు. త‌న కుమారుడిని జ‌గ‌న్ కు అనుకూలంగా ప్ర‌చారం కోసం పంపారు. ఇక‌, త‌న విద్యాసంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌లేద‌ని ఆక్షేపిస్తూ.. చంద్ర‌బాబుపై పోరు స‌ల్పారు.

అయితే, ఇంత‌లోనే ఆమ‌ధ్య జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా మంచు ఫ్యామిలీ స‌టైర్లు పేల్చింది. కానీ, ఇంత‌లోనే అంతా స‌ర్దుకుంది. తాజాగా మోహ‌న్‌బాబు మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని, చ‌చ్చిపాము గురించి ఎవ‌రైనా మాట్లాడుకుంటారా? అని వ్యాఖ్యానించ‌డంతో ఒక్క‌సారిగా ఈ వ్యాఖ్య‌లు టీడీపీలో ర‌చ్చ‌కు దారితీశాయి. ఒక‌ప్పుడు ఇదే పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు వెళ్లిన మోహ‌న్‌బాబు ఇలా విమ‌ర్శించ‌డం ఏంట‌ని కొంద‌రు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై కౌంట‌ర్ ఇవ్వాల‌ని భావించారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తే.. మ‌రింత‌గా పార్టీని ఏకేస్తార‌ని, కాబ‌ట్టి సైలెంట్‌గా ఉండ‌డ‌మే బెట‌ర‌ని బాబు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా చంద్ర‌బాబును ఇలా వ్యాఖ్యానించ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి మోహ‌న్ బాబు చేసిన వ్యాఖ్య‌లు మాత్రం టీడీపీలో ఒక‌విధ‌మైన ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌య్యాయ‌నే చెప్పాలి. మున్ముందు ఆయ‌న జ‌గ‌న్ క‌నుక తాను కోరుకున్న ప‌ద‌వి ఇస్తే..బాబును ఏకేయ‌డం మ‌రింత ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news