చంద్రబాబుని అంతమాటనేశావేంటి మోపిదేవి?

-

చూస్తున్నారు చూస్తున్నారు… వింటున్నారు వింటున్నారు… పడుతున్నారు పడుతున్నారు… ఇక ఆగేది లేదనుకున్నారో ఏమోకానీ.. తనకున్న అనుమానాలను బహిర్గతం చేసేశారు ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ! తాజాగా మీడియా ముందుకు వచ్చిన మోపిదేవి… ఉన్నఫలంగా చంద్రబాబువి ఎంత దిగజారుడు రాజకీయాలో అంటూ మైకందుకున్నారు. అంతేనా… టీడీపీ కార్యకర్తలనే స్లీపర్ సెల్సులా తయారుచేసి కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారని కూడా అనేశారు! ఇంతకూ మోపిదేవీ ఏమేమి అన్నారు… వివరాలు చూద్దాం!

కరోనా అనే సమస్య… టీడీపీ – వైకాపాల మధ్య ఉన్న రాజకీయ సమస్యగా టీడీపీ చూస్తూ, అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తుందని మొదలుపెట్టిన మోపిదేవి… ఆఖరికి చంద్రబాబు ఎంతకు దిగజారారో చెప్పారు! తాజాగా ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కనగరాజు గారి ప్రమాణస్వీకారాన్ని కూడా రాజకీయం చేసే స్థాయికి బాబు దిగజారిపోయారని అన్నారు. కనగరాజు రావడం వల్లే రాజ్ భవన్ లో కరోనా కేసులు వచ్చాయన్నంతగా నిస్సిగ్గు వ్యాఖ్యలు చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు! అన్ని టెస్టులూ చేయించుకుని… ఆయనకు ఎటువంటి సమస్యా లేదని తెలిసిన తర్వాతే ప్రమాణ స్వీకారణం చేసిన వ్యక్తిని పట్టుకుని… కరోనా వైరస్ లేని ఆ వ్యక్తి వల్ల రాజ్ భవన్ లో కరోనా వచ్చిందని చెప్పేటంత చిల్లర రాజకీయాలకు బాబు తెరలేపారని మోపిదేవి ఫైరయ్యారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఏదీ అతీతం కాదన్ని చెబుతున్నారు మోపిదేవి!

ఇదే క్రమంలో… టీడీపీ నాయకులు అంతా కలిసి స్లీపర్ సెల్స్ ని రెడీ చేసి గ్రామాలలో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారేమో అన్న అనుమానం కూడా తనకు కలుగుతుందని అనేశారు. ఎటువంటి సమస్యలూ లేని ప్రాంతాల్లో కూడా కొత్తగా కరోనా వస్తుందంటే… ఇందులో కూడా టీడీపీ కుట్ర దాగిఉందేమో అని మోపిదేవి అనుమానం వ్యక్తం చేశారు. ఇటు జగన్ ని, అటు ప్రజలను ఇబ్బందిపెట్టడానికి చంద్రబాబు ఎంత స్థాయికైన దిగజారతారనడానికి ఎలాంటి సందేహం లేదని మోపిదేవి సంచలన ఆరోపణలు చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news