డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్  డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తాజాగా సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇవాళ  హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణికి నివేదించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సమావేశానికి  నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి. దానయ్య, సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు హాజయ్యారు. సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news