2022లో జమిలి ఎన్నికలు… సిద్దంగా ఉండాలి : టీడీపీ ఎంపీ

-

ఈరోజు గుంటూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా తెనాలి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయిన గల్లా జయదేవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని ఆయన అన్నారు. అందుకే 2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలని ఆయన శ్రేణులకి పిలుపునిచ్చారు.

న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయన్న ఆయన అంతిమ విజయం మనదే అవుతుందని అన్నారు. అలానే ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగిందని అందుకే న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకవేళ తాను జైలుకు వెళ్ళినా ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు గల్లా జయదేవ్.

Read more RELATED
Recommended to you

Latest news