అన్న క్యాంటీన్లకు కోటి విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి..!

-

అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం అందించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి. కోటి రూపాల చెక్కును మంత్రి నారాయణకు అందించాడు భువనేశ్వరి. అయితే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. మళ్ళీ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి రూపాల విరాళము ఇచ్చిన నారా భువనేశ్వరి 5 రూపాలకే కడుపునింపే అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం మహోన్నత కార్యక్రమం అని పేర్కొన్నారు.

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు ఎంతో గొప్ప కార్యక్రమం. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది స్వర్గీయ ఎన్టీఆర్ నినాదం అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన అన్న క్యాంటీన్లకు నా వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ విరాళం ఇస్తున్నాను. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనది అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news