పాలిచ్చే ఆవుని వద్దని.. తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు – నారా లోకేష్

-

వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువగలం పాదయాత్ర సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా గుండ్లకొండ, గుడిమిర్ల, బుర్రుకుంటలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రక్షాళన చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబును వద్దనుకుని.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అందరినీ ముద్దులు పెట్టుకుని తిరిగిన జగన్ ని నమ్మి గెలిపించారని అన్నారు. “పాలిచ్చే ఆవుని వద్దని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు” అంటూ సెటైర్లు వేశారు. ఇక ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ అని అన్నారు నారా లోకేష్. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళతారు.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news