BREAKING : ఏపీలో విషాదం..జీలుగుకల్లు తాగి ఒకరి మృతి.. మరో 4 గురు !

-

BREAKING : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. జీలుగు కల్లు తాగి ఒకరి మృతి చెందారు. ఈ సంఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. జీలుగు కళ్ళు తాగిన నలుగురు గిరిజన యువకులకు అస్వస్థత చోటు చేసుకుంది. ఇందులో ఓ గిరిజన యువకుడు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అల్లూరి జిల్లా జికె వీధి మండలం సప్పర్ల ప్రభుత్వ హస్పటల్ పరిధిలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్సు లో ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా పాంగి లోవరాజు (25) మృతి చెందాడు. విషమంగా ఉన్న పొంగి రామదాసును నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తాగింది జీలుగు కళ్లేనా, ఇంకేదైనా అన్న దానిపై స్పష్టత రాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news