బ్రేకింగ్ : టీడీపీ నుండి మరో ఎమ్మెల్యే ఔట్.. ఎల్లుండే ముహూర్తం !

-

ఏపీలో టీడీపీని వ‌రుస‌గా క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవ‌రు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారో ? తెలియ‌డం లేదు. పార్టీకి దూర‌మైన ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తే ప్ర‌స్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది చంద్ర‌బాబుకు, లోకేష్‌కు అందుబాటులోకి రావ‌డం లేదంటున్నారు. మొన్ననే వాసుపల్లి గణేష్ పార్టీకి దూరం అయ్యారు.

ఇప్పుడు గంటా చేరికకు కూడా రంగం సిద్దం అయింది. ఎల్లుండి సీఎం జగన్ ను గంటా శ్రీనివాస రావు కలవనున్నారు. అదే రోజున ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. కుమారుడు రవితేజను జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చనున్న ఆయన మిగతా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల లానే ఈయన కూడా బయట నుండే మద్దతు ఇవ్వనున్నారు. ఇక గంటా చేతిలో ఓడిన కమ్మిలి కన్నపరాజుకు జగన్ నుండి పిలుపు వచ్చింది. దీంతో గంటా చేరిక ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news