APని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర”గా ప్రకటించండి – పవన్‌ కళ్యాణ్‌

-

25 రాజధానులు చేసి, ‘ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరో ట్వీట్‌ చేశారు. నిన్న పవన్‌ కళ్యాణ్‌ పై ఏపీ మంత్రులు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే.. వారికి కౌంటర్‌ గా మరోసారి పవన్‌ కళ్యాణ్‌ గర్జించాడు. వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే, ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి ? అన్నారు.

ఏది ఏమైనప్పటికీ YCP నాయకులు… చట్టం, న్యాయవ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారన్నారు. మిగిలిన పౌరులు ఏమనుకుంటున్నారో వారు ఆలోచించరు. చెప్పినా వారు పట్టించుకోరని ఆగ్రహించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే.. APని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర”గా ప్రకటించాలని పవన్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి, 25 రాజధానులు చేయండి చురకలు అంటించారు. ‘ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి’ అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news