హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదే మన నినాదం – పవన్ కళ్యాణ్

-

అమలాపురం సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తమ నినాదాలు ఇవేనంటూ స్లొగన్స్ చేశారు. ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి.

హలో ఏపీ… బై బై వైసిపి’ అని నినాదించారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. అలాగే, వివేకా హత్య కేసుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు. ‘వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా క్రైమ్ రేట్ పెరిగింది. వివేకా హత్యకు కారణం ఎవరో చెప్పకుండా గుండెపోటుతో చనిపోయారని ఎలా చెబుతారు. సిబిఐని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైసిపికి తోడ్పాటునందిస్తుంది’ అని పవన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news