పవన్ కళ్యాణ్ వారాహి రెండో విడత షెడ్యూల్ ఖరారు

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రెండో విడత షెడ్యూల్ ఖరారు అయింది. ఏలూరు నుంచే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.


అలాగే, ఇవాళ మరోసారి జనసేన పార్టీ నేతలతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్‌.. రెండో విడత వారాహి యాత్రపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఏలూరు సభ అనంతరం వారాహి యాత్ర రూట్ మ్యాప్ ఖరారుపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్‌. దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉండే ఛాన్స్ ఉంది. కాగా, కొంత మంది టీడీపీ నేతలు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news