చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..!

-

చివరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాలశౌరి ఉంటారని భావించారు. అయితే, ఆఖరి నిమిషంలో పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో దించనున్నారని ప్రచారం జరుగుతోంది.

తాజా మార్పులను పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థులకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి బందరు పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని అంతా భావించారు.

Read more RELATED
Recommended to you

Latest news