పవన్ కళ్యాణ్ పై ముద్రగడ విషం చిమ్ముతున్నారు – పోతిన మహేష్

-

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన నేత పోతిన మహేష్. ముద్రగడ లేఖలపై పవన్ కళ్యాణ్ సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు. ముద్రగడపై నా లేఖలు, వ్యాఖ్యలు పార్టీవేనని.. వ్యక్తిగతం కాదన్నారు. పవన్ పై ముద్రగడ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ముద్రగడను ఒక్క మాట పవన్ అనలేదన్నారు. అయినా పవన్ కు లేఖలు ఎందుకు రాస్తున్నారో కాపు సామాజిక వర్గానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు.

ఏ ప్రలోభాలు ఆశించి ముద్రగడ ఇది చేస్తున్నారని ప్రశ్నించారు. ముద్రగడకు 75 లక్షల ఫ్లాట్ 30 లక్షలకు ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. మీకు ఫ్లాట్ తక్కువకు ఇప్పించిన నేతలు ఎవరు..? అని ప్రశ్నించారు పిఠాపురం లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేశారు పోతిని మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news