ఏపీలో బీజేపీ ప్రభుత్వం రావాలి – పురంధేశ్వరి

-

ఏపీలో బీజేపీ ప్రభుత్వం రావాలని పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రి బిజెపి సభలో పురంధేశ్వరి మాట్లాడుతూ… మోదీ 9 సం”ల పాలన చారిత్రాత్మకం.. “సేవ, సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమం” నినాదంతో మోదీ తన మార్క్ ను చూపిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రమించారు.

కానీ నరేంద్ర మోదీ 160 ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు. దేవరపల్లి నుండి ఖమ్మం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రాజమండ్రి నుండి విజయనగరం ఆరులైన్ల హైవే, కొవ్వూరు నుండి విజయవాడ క్రొత్త హైవే పై రెండు గంటలలో ప్రయాణం, మోరంపుడి ఫ్లైఓవర్ అన్నారు.

రాజమండ్రిలో మెడికల్ కాలేజ్…ఇవన్నీ మన ప్రాంత ప్రజల ప్రజల అభివృద్ధి కొరకు మోదీ ఇచ్చిన వరాలేనని వెల్లడించారు పురంధేశ్వరి. ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కాతేరు నుండి సీతానగరం వరకు 18 కి.మీ.ల రోడ్డును వేయలేకపోతున్నందుకు సిగ్గుపడాలని.. ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి కి అధికారం ఇస్తే… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి ఖాయమన్నారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news