ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్ విద్యార్థులకు ఇవాల్టి నుంచే రాగిజావ

-

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. స్కూలు విద్యార్థులకు ఇవాల్టి నుంచి రాగిజావా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఈనెల 10న ప్రారంభించాల్సిన కార్యక్రమం వాయిదా పడగా కోడ్ ముగియడంతో ఇవాళ ప్రారంభించనుంది.

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగిజావా, మరో మూడు రోజులు చిక్కి అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లలోనే గ్లాసులు అందుబాటులో ఉంచనుంది. ఇక ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ఏపీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news