నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు – వైసీపీ ఎమ్మెల్యే

-

నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు అని చురకలు అంటించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆయన మంత్రి గా ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చామన్న భ్రమలు కల్పించారు.. ఇప్పుడు పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ జిల్లా నేతలు గ్లోబుల్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.టిడిపి హయంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. అవి చీకటి ఒప్పందాలు అని ఆరోపణలు చేశారు.

రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టిడిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారు…అభూత కల్పనాలను నిజాలుగా చూపించే క్రెడిట్ టిడిపికే తగ్గుతుందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది.. భూముల కోసమని…వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని వెల్లడించారు.జాకీ పరిశ్రమ టిడిపి హయంలో వచ్చినట్లు.. వ్తెసీపీ హయంలో వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం పెట్టారు…లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు పెట్టేందుకు మేము సహకరిస్తాన్నారు.

 

రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకోమని..పరిటాల సునీత సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సిబిఐ విచారణకు సిద్ధమా…! అని సవాల్ చేశారు. రైతులను మభ్య పెట్టేందుకు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు…అమరావతి నిర్మాణాన్ని కూడా నటన చాత్యుర్మతో ప్రజలని భ్రమలో పెట్టారన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news