ఏపీ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం..ఒక్క రోజే రూ.23 కోట్లు

-

ఏపీ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిం ది. ఈ నెల 18 న రికార్డుస్థాయి లో ఆదాయాన్ని ఆర్జించంది ఏపీఎస్ ఆర్టీసీ. ఆ రోజు ఒక్కరోజే 23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ఆర్టీసీ. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం సాధించిన రోజుగా రికా ర్డు సృష్టించింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఆదరణ చూపించారు.

సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా సరాసరిన రోజుకు అధిక ఆదాయం నమోదు చేసింది ఆర్టీసీ. కార్గో సర్వీసులోనూ ఒక్క రోజులో 55 లక్షలు ఆదాయం సాధించింది ఏపీఎస్‌ ఆర్టీసీ. కార్గోలో ఇప్పటివరకు ఒకరోజు ఆదాయం 45 లక్షలు ఉండగా దాన్ని అధిగమించి రికార్డు నెలకొల్పింది ఆర్టీసీ. దీంతో ఆర్టీసీ సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కృషిని ప్రసంశించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు…ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news