ఏపీకి కేంద్రం మరో శుభవార్త..రూ.879.08 కోట్లు విడుదల

-

ఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగో విడత కింద 14 రాష్ట్రాల‌కు రూ.7,183.42 కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేసింది మోడీ సర్కార్‌.

ఈ మేరకు ఏపికి రూ.879.08 కోట్లు విడుద‌ల చేసింది మోడీ ప్రభుత్వం. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేసేందు ఏపికి రూ.10,549 కోట్లు ఇవ్వాల‌ని 15 ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపికి రూ.3,516.33 కోట్లు విడుద‌ల చేసింది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేయడంతో.. జగన్‌ సర్కార్‌ కాస్త ఉపసమనం దొరికింది. కాగా… ఏపీ సర్కార్‌ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news