టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలలోని కోవర్టుల ఆటలు సాగవు…!

-

 

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలోని తమ పార్టీకి అనుకూలంగా పనిచేసే కోవర్టుల ఆటలు సాగవని, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమన్న వార్తలు టీడీపీలోని కోవర్టులకు రుచించడం లేదని, జనసేనతో పొత్తు పొసగకూడదని చంద్రబాబు గారి చెవిలో ఏదో చెబుతున్నారని, అలాగే జనసేన లోని కోవర్టులు కూడా పవన్ కళ్యాణ్ గారి చెవిలో కూడా ఏదో చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారని అన్నారు రఘురామకృష్ణ రాజు.

బీజేపీలో తమ పార్టీకి అనుకూలంగా ఉండే నాయకులు, రానున్న ఎన్నికల్లో తాము జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారని అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ కూడా తాము బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెప్పడం లేదని అన్నారు. ఎవరెన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేని ప్లేట్ చేయాలని చూసినా వారి పప్పులు ఉడకవని, టీడీపీ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన తరువాత, పవన్ కళ్యాణ్ గారు ఇంత వరకు మరొక ప్రకటన చేసింది లేదని, దీన్ని బట్టి పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం అని అన్నారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు, ఓటరు జాబితాలో ఉన్నది లేనిది పరిశీలించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news