జనసేన సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదు- సజ్జల

-

ఇప్పటం విషయంలో పవన్ కల్యాణ్‌కు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కాలేదు.. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు.. దీనికి పవన్ హైవే పై చేసిన డ్రామా అందరూ చూశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకును…ఏమీ లేని విషయాన్ని ఒక సినిమా కథలా తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. ఇదంతా కుట్రపూరితంగా చేశారు. నిజంగా అధికారంలోకి రావాలి అనుకునే రాజకీయ పార్టీలు ఇలా చేస్తాయా?? అని ప్రశ్నించారు. 2019లోనూ ఇలానే ప్రజలను రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news