AP : నేటి నుంచి వాలంటీర్లకు వందనం

-

ఏపీ వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త. ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న వాలంటీర్లకు నేటి నుంచి అవార్డులను ప్రభుత్వం అందజేయనుంది. వాలంటీర్లకు వందనం పేరుతో రూ.243 కోట్లను వెచ్చించనుంది.

‘సేవా వజ్ర’ పొందిన 875 మందికి రూ. 30 వేల చొప్పున నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందజేస్తారు. సేవారత్న పొందిన 4,220 మందికి రూ. 20వేలు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, సేవామిత్ర పొందిన 2,28,624 మందికి రూ.10వేలు, శాలువా, బ్యాడ్జ్ అందిస్తారు. ఇవాళ్టి నుంచి నుంచి పది రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జరుగనుంది. ఇవాళ 10.10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాలంటీర్ల సేవా అవార్డు కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news