చంద్రబాబు ఎక్కలేరు తొక్కలేరు… యూపీతో పోలుస్తూ సెటైర్లు!

-

ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందనే విశ్లేషణలు మొదలైపోయాయి. కరోనా సమయంలో భాగ్యనగరానికీ, జూం కీ పరిమితమైనప్పుడే బాబు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయనే కామెంట్లు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు & కో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతున్నారు బీజేపీ నేతలు!

అవును… ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కు ఏపీలో చంద్రబాబుకు కంపేర్ చేస్తూ విశ్లేషణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. యూపీలో ఒకపుడు తనదైన చక్రం తిప్పిన ములాయం సింగ్.. కొడుకు అఖిలేష్ యాదవ్ ని సీఎంగా కొన్నాళ్ళపాటు కూర్చోబెట్టగలిగారు. అయితే ఇపుడు ఆ తండ్రీ కొడుకల పార్టీకే దిక్కులేని స్థితి. ఇక్కడ చిత్రమేమిటంటే… వారిది కూడా సైక్ల్ గుర్తే!

దీంతో… అదే సైకిల్ గుర్తు కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు – లోకేష్ లకు అదే గతి పట్టబోతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెటైర్లు వేస్తున్నారు. తన కొడుకుని వారసుణ్ణి చేద్దామని బాబు అనుకుంటుంటే… ఆ పేరు చెబితేనే పార్టీలో ఉన్న జనాలు వేరే పార్టీలోకి పారిపోతున్నారనేది జీవీఎల్ వెటకారం. దీంతో మరో అడుగు ముందుకేసిన బీజేపీ నేతలు… చంద్రబాబు మెయిన్ స్ట్రీం పాలిటిక్స్ నుంచి ఇప్పటికే తప్పుకున్నారని కూడా అంటున్నారు. సైక్ల్ ఎక్కలేని తొక్కలేని బాబుకు రిటైర్మెంట్ అనేది మంచి ఆలోచన అనేది వారి సూచనగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news